తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- November 03, 2025
హైదరాబాద్: ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్లు అందరి వద్ద ఉంటున్నాయి.గూగూల్ మ్యాప్స్ను చాలా మంది వాడుతున్నారు.దీంతో గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సుల సమాచారం, రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది.
స్మార్ట్ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, మీరు వెళ్లాల్సిన ప్రాంత వివరాలు టైప్ చేసి, ఎక్కాల్సిన బస్సు ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, డబ్బులు చెల్లిస్తే రిజర్వేషన్ పూర్తయి, మీ స్మార్ట్ఫోన్కే ఈ-టికెట్ వస్తుంది.
అంతేకాదు, రిజర్వేషన్ లేని బస్సుల్లోనూ గూగుల్ మ్యాప్స్లో టికెట్ తీసుకుని ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ వెబ్సైట్తో పాటు బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు కొని రిజర్వ్ చేసుకుంటున్నారు.
గూగుల్ మ్యాప్స్లో బస్సు టికెట్ను రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సు సర్వీసుల వివరాలను అధికారులు గూగుల్కు ఇవ్వనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని గూగుల్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గూగుల్స్ మ్యాప్స్లో టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది.
మరో సదుపాయం..
మరోవైపు, ఇప్పటికే బస్సుల్లో టికెట్లు ఇచ్చే విధానంలోనూ స్వల్పమార్పులు చేయనుంది టీజీఎస్ఆర్టీసీ.బస్ ఎక్కిన తర్వాత ప్రయాణికులు టికెట్ తీసుకునే వేళ క్రెడిట్/డెబిట్ కార్డుతో చెల్లింపులు చేయొచ్చు.అయితే, ప్రయాణికులు పిన్ నంబరును నమోదు చేసే సమయంలో ఎక్కువ సమయం పడుతుండడంతో లేట్ అవుతోంది. దీంతో క్రెడిట్/డెబిట్ కార్డును ప్రయాణికులు టిమ్ మిషన్పై పెట్టగానే నగదు చెల్లింపులు జరిగే విధానాన్ని ఆర్టీసీ తీసుకురానుంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







