1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- January 10, 2026
దుబాయ్: దుబాయ్ లో జరుగుతున్న 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ లో 522 మంది కంటెంట్ క్రియేటర్లు మరియు న్యూ మీడియా నిపుణులు శిక్షణ పూర్తి చేసి పట్టాలు పొందారు.ఈ కార్యక్రమానికి దుబాయ్ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.
యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం మరియు న్యూ మీడియా అకాడమీ కలిసి నిర్వహించిన 7 ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఈ పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ, “భవిష్యత్ నిర్మాణానికి మానవ వనరులపై పెట్టుబడి అత్యంత కీలకం.యూఏఈ విలువలను ప్రతిబింబించేలా, బాధ్యతాయుతంగా దేశ సందేశాన్ని ప్రపంచానికి చేరవేసే కంటెంట్ క్రియేటర్లను తయారు చేయడం అవసరం”అని అన్నారు.
ఈ కార్యక్రమానికి క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ అల్ గెర్గావీ కూడా హాజరయ్యారు.
- 15 వేల మందితో భారీ సమ్మిట్
- ఈ సమ్మిట్ జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్లోని ఎమిరేట్స్ టవర్స్, డీఐఎఫ్సీ, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ వేదికగా జరుగుతోంది.
- ఈ కార్యక్రమానికి 15 వేల మందికి పైగా కంటెంట్ క్రియేటర్లు, 500కు పైగా వక్తలు హాజరయ్యారు. వీరి సోషల్ మీడియా అనుచరులు కలిపి 3.5 బిలియన్లకు పైగా ఉన్నారు.
- వివిధ శిక్షణా కార్యక్రమాలు
- ఈ స్నాతకోత్సవంలో భాగంగా
- ఇంపాక్ట్ మేకర్స్, స్పెషల్ కంటెంట్ క్రియేటర్లు, చారిత్రక కంటెంట్, ఫారిస్ అల్ ముహ్తవా, ప్రభుత్వ డిజిటల్ కమ్యూనికేషన్ డిప్లొమా, ఆర్థిక కంటెంట్ పయనీర్స్, సోషల్ మీడియా ప్రొఫెషనల్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
- ఈ శిక్షణ ద్వారా కంటెంట్ రైటింగ్, డిజిటల్ సాధనాల వినియోగం, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కంటెంట్ తయారీపై అవగాహన కల్పించారు.
- యూఏఈ గ్లోబల్ స్థాయిలో బలమైన సందేశం
ఈ కొత్త తరం కంటెంట్ సృష్టికర్తల ద్వారా యూఏఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రభావవంతంగా చేరుతుందని నిర్వాహకులు తెలిపారు.
--(బాజీ షేక్,యూఏఈ)
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









