హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- January 10, 2026
హైదరాబాద్: హృదయ వైద్య రంగంలో తెలంగాణను జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మక “ఫెలోస్ ఇండియా 2026” అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. జనవరి 9 నుంచి 11 వరకు నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ మూడు రోజుల అకడమిక్ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖ హృదయ వైద్య నిపుణులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరం దేశంలోని యువ హృదయ వైద్యులకు అధునాతన శిక్షణ కేంద్రంగా మరోసారి నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి కార్డియాలజీ ఫెలోస్ మరియు యువ కన్సల్టెంట్లు పాల్గొని, ఆధునిక హృదయ చికిత్సల పై లోతైన అవగాహన పొందారు.
మూడు రోజుల పాటు జరిగిన శాస్త్రీయ సదస్సుల్లో క్లిష్టమైన కోరొనరీ యాంజియోప్లాస్టీలు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ చికిత్సలు, ఆధునిక వాల్వులర్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు మరియు భవిష్యత్తు కార్డియాలజీపై ప్రత్యేక సెషన్లు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా డా.ఎన్.ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ ఛైర్మన్ మాట్లాడుతూ, “హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రముఖ కార్డియాలజీ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ‘ఫెలోస్ ఇండియా 2026’ ద్వారా యువ వైద్యులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకున్నారు” అన్నారు.
డా. శరత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ–ఫెలోస్ ఇండియా 2026, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ, “తెలంగాణలో హృదయ వ్యాధులు పెరుగుతున్న ఈ సమయంలో, అత్యాధునిక శిక్షణ పొందిన వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందించగలరు.ఈ కార్యక్రమం ఆ దిశగా కీలక పాత్ర పోషించింది” అని తెలిపారు.
మెడికవర్ హాస్పిటల్స్ విద్యా ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ డా.అనిల్ కృష్ణ జి., చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ,“హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే మా దృష్టికి ‘ఫెలోస్ ఇండియా 2026’ ఒక సజీవ ఉదాహరణ. తెలంగాణ ప్రజలకు ప్రపంచ స్థాయి హృదయ వైద్యం అందించడమే మా లక్ష్యం” అన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో, హైదరాబాద్ నగరం అధునాతన హృదయ వైద్య శిక్షణకు హబ్గా మరింత గుర్తింపు పొందిందని, మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణ ఆరోగ్య రంగంలో తన కీలక పాత్రను మరోసారి చాటిందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









