విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- November 05, 2025
మస్కట్: ఒమన్ లో తప్పిపోయిన వ్యక్తి కథ విషాదాంతమైంది. అతడిని చనిపోయన స్థితిలో కనుగొన్నారు. కోస్ట్ గార్డ్ పోలీసుల నేతృత్వంలోని మారిటైమ్ రెస్క్యూ బృందాలు తప్పిపోయిన పౌరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ముత్రాలోని విలాయత్లోని పోర్ట్ సుల్తాన్ కబూస్ నుండి దాదాపు ఒక నాటికల్ మైలు దూరంలో మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ముత్రాలోని వాడి నివాసి అయిన ఆ వ్యక్తి గత ఆదివారం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి అతని గురించి అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చివరకు పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









