హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- November 07, 2025
హైదరాబాద్: హైదరాబాద్ క్రీడాభిమానులకు మరో శుభవార్త. నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం త్వరలో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్ను ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ స్టేడియాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్త స్టేడియం రూపకల్పనలో లండన్ లార్డ్స్, ఆస్ట్రేలియా సిడ్నీ, మెల్బోర్న్ వంటి ప్రసిద్ధ మైదానాల ఆర్కిటెక్చర్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడా, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడం కూడా. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇది హైదరాబాద్ కు మరో ప్రౌడిని తెచ్చిపెడుతుందనే అంచనాలు ఉన్నాయి.
కొత్త స్టేడియం నిర్మాణం పై పూర్తి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం మాజీ భారత క్రికెటర్లతో కూడిన బృందాన్ని విదేశాలకు పంపాలని నిర్ణయించింది. వీరు లార్డ్స్, మెల్బోర్న్, సిడ్నీ వంటి ప్రతిష్టాత్మక స్టేడియాలను సందర్శించి, అవి ఎలా నిర్వహించబడుతున్నాయో, డిజైన్ మరియు ఫెసిలిటీల పరంగా ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో పరిశీలించనున్నారు. ఈ బృందం సిఫార్సుల ఆధారంగా స్టేడియం రూపకల్పన, సీటింగ్ కెపాసిటీ, సదుపాయాలు, రవాణా వ్యవస్థ వంటి అంశాలను తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధునిక క్రీడా వేదికలతో సమానమైన మౌలిక వసతులు కల్పించాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
రవాణా సౌకర్యాలు, భౌగోళిక పరిస్థితులు, భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించి, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో స్టేడియం ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఉండటం వల్ల నగరంలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. కందుకూరు ప్రాంతం ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్ధి చెందుతున్నందున, కొత్త స్టేడియం అక్కడ ఏర్పాటు అయితే ఆర్థిక, క్రీడా రంగాల్లో వేగవంతమైన వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







