ఐరాస ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళo

- July 24, 2016 , by Maagulf
ఐరాస ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళo

శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసే దళాలు, పౌరుల చేతుల్లో లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది. ఈమేరకు ఐరాస క్షేత్ర సహాయ శాఖ (డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో ఈ ట్రస్ట్‌కు విరాళమిచ్చిన తొలి దేశంగా నిలిచింది. కాగా, ఐరాస భద్రత మండలి అనుమతి కమిటీల(ఎఎన్‌ఎస్‌సీ) పనితీరుపై భారత్ మండిపడింది. కొన్ని దేశాలకు సంబంధించి సంకుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com