అనుమానిత ఉగ్రవాదులును ఏటీఎస్ అధికారులు అరెస్ట్...
- July 24, 2016
అనుమానిత ఉగ్రవాదులుగా శనివారంనాడు ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేసిన రిజ్వాన్ ఖాన్, ఈవారంలోనే నవీ ముంబైలో అదుపులోకి తీసుకున్న అర్షిద్ ఖురేషీల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఇద్దరూ కలిసి సుమారు 800 మందిని ఇస్లాం మతంలోకి మార్చారట. ఈ విషయం తమ విచారణలో వెల్లడైనట్టు ఏటీఏస్ అధికారులు తెలిపారు. వీరిని మరింత లోతుగా విచారించిన ఉన్నతాధికారులు కీలక వివరాలు రాబట్టారు. పట్టుబడిన ఇద్దరికీ వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు జకీర్ నాయక్ నిర్వహిస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, ఖాన్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, వివాహ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. క్రిస్టియన్, హిందూ మతాలకు చెందిన 800 మందికి పైగా ప్రజలను వీరు ముస్లిం మతంలోకి మార్చినట్టు ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైనట్టు చెప్పారు. అరెస్టయిన ఇద్దరికీ ఐఆర్ఎఫ్తో పాటు మరో రెండు సంస్థలతో సంబంధాలున్నాయని, ఆ సంస్థలతో కలిసి వీరు పెద్దఎత్తున మతమార్పుడులు జరిపారని ఏటీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. 'మా విచారణలో వెల్లడైన విషయాలు చాలా కీలకమైనవి. మతమార్పిడులతో ప్రమేయం ఉన్న సంస్థలు ప్రధానంగా విద్యార్థులు, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని వారికి లీగల్ పరమైన, ఆర్థిక పరమైన సహాయం అందిస్తున్నట్టు పట్టుబడిన వ్యక్తులు విచారణలో వెల్లడైంది' అని ఏటీఏస్ అధికారి ఒకరు తెలిపాయి. కాగా, మతమార్పిడులతో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సంస్థ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఖాన్ అప్పుడప్పుడూ తమ కార్యాలయానికి వచ్చేవాడని, అయితే తమ సంస్థ కార్యకలాపాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







