అనుమానిత ఉగ్రవాదులును ఏటీఎస్ అధికారులు అరెస్ట్...
- July 24, 2016
అనుమానిత ఉగ్రవాదులుగా శనివారంనాడు ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేసిన రిజ్వాన్ ఖాన్, ఈవారంలోనే నవీ ముంబైలో అదుపులోకి తీసుకున్న అర్షిద్ ఖురేషీల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఇద్దరూ కలిసి సుమారు 800 మందిని ఇస్లాం మతంలోకి మార్చారట. ఈ విషయం తమ విచారణలో వెల్లడైనట్టు ఏటీఏస్ అధికారులు తెలిపారు. వీరిని మరింత లోతుగా విచారించిన ఉన్నతాధికారులు కీలక వివరాలు రాబట్టారు. పట్టుబడిన ఇద్దరికీ వివాదాస్పద ముస్లిం ప్రచారకుడు జకీర్ నాయక్ నిర్వహిస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, ఖాన్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, వివాహ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. క్రిస్టియన్, హిందూ మతాలకు చెందిన 800 మందికి పైగా ప్రజలను వీరు ముస్లిం మతంలోకి మార్చినట్టు ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైనట్టు చెప్పారు. అరెస్టయిన ఇద్దరికీ ఐఆర్ఎఫ్తో పాటు మరో రెండు సంస్థలతో సంబంధాలున్నాయని, ఆ సంస్థలతో కలిసి వీరు పెద్దఎత్తున మతమార్పుడులు జరిపారని ఏటీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. 'మా విచారణలో వెల్లడైన విషయాలు చాలా కీలకమైనవి. మతమార్పిడులతో ప్రమేయం ఉన్న సంస్థలు ప్రధానంగా విద్యార్థులు, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను లక్ష్యంగా చేసుకుని వారికి లీగల్ పరమైన, ఆర్థిక పరమైన సహాయం అందిస్తున్నట్టు పట్టుబడిన వ్యక్తులు విచారణలో వెల్లడైంది' అని ఏటీఏస్ అధికారి ఒకరు తెలిపాయి. కాగా, మతమార్పిడులతో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక సంస్థ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఖాన్ అప్పుడప్పుడూ తమ కార్యాలయానికి వచ్చేవాడని, అయితే తమ సంస్థ కార్యకలాపాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









