కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- November 12, 2025
కువైట్ః మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా పర్యవేక్షణ కఠినతరం చేసినట్లు కువైట్ బ్యాంకులు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.వ్యక్తిగత ఖాతాల్లోకి అసాధారణ రీతిలో ఒకేసారి పెద్ద మొత్తం జమకావడంపై సమీక్ష జరుపనున్నారు. వాణిజ్య లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వ్యక్తిగత ఖాతాలను ఉపయోగిస్తున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. "వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్వీకరించడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించకూడదు" అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
పారదర్శకతను నిర్ధారించడం, ఆర్థిక మార్గాల దుర్వినియోగాన్ని అరికట్టడం మరియు అంతర్జాతీయ మనీలాండరింగ్ వ్యతిరేక, ఉగ్రవాద నిరోధక ఆర్థిక ప్రమాణాలకు కువైట్ కట్టుబడి ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







