ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- November 12, 2025
కువైట్: కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా కొత్త కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ (T2) ప్రాజెక్ట్ ను పరిశీలించారు. టెర్మినల్లో జరిగే వీక్లీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆ స్థలాన్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా మంత్రులతో పాటు, ప్రజా పనుల మంత్రి డాక్టర్ నౌరా అల్-మషాన్ ఈ మెగా ప్రాజెక్ట్ గురించి ప్రధాన మంత్రికి వివరించారు.
ఇది కువైట్లోని మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టులలో ఒకటి అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనుకున్న ప్రకారం నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు కువైట్ ప్రధాన మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









