100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!

- November 13, 2025 , by Maagulf
100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!

రియాద్: రియాద్ బస్సులో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 100 మిలియన్లను దాటింది. ఇది రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన విజయాన్ని సూచిస్తుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

రియాద్ బస్సు నెట్‌వర్క్ 1,900 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న 91 మార్గాల్లో సేవలు అందిస్తుంది.  నెట్‌వర్క్‌ లో అత్యున్నత ప్రమాణాలు, భద్రతతో కూడిన 842 ఆధునిక బస్సులు ఉన్నాయని తెలిపింది. ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా ఆధునిక ప్రమాణాల ప్రకారం రూపొందించిన 2,950 కంటే ఎక్కువ బస్ స్టాప్‌లు నెట్‌వర్క్ లో భాగంగా సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com