ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- November 15, 2025
తెలంగాణ: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో రోజూలాగే చిన్నారులకు వైద్యులు ఇంజక్షన్లు ఇచ్చారు.
ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో శిశువుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. ఆ చిన్నారుల హెల్త్ కండీషన్పై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
ఆ చిన్నారులు అందరూ ఇటీవల వైరల్ ఫీవర్తో ఇటీవల ఆసుపత్రిలో చేరినవారే. ప్రస్తుతం ఆ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ









