ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ లేదిక
- July 24, 2016
ఆగస్ట్ నుంచి, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఉండబోదని అబుదాబీ పోలీస్ వెల్లడించింది. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2010 నుంచి ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్ అమల్లోకి వచ్చింది. అయితే రోడ్డు ప్రమాదాల్ని ఇంకా తగ్గించే క్రమంలో, వాహనదారులకు జరీమానాలపై భయం పెంచేలా, రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండేలా చేసేందుకు జరీమానాలపై డిస్కౌంట్ తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత మే నెలలో 1837 మంది వాహనదారులు గంటకు 200 కిలోమీటర్ల పైబడి వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. 2016 తొలి మూడు నెలల్లో రోడ్లపై ప్రమాదాలు విపరీతంగా పెరిగాయి. దాంతో వాహనదారులకు అతి వేగంపై అప్రమత్తం చేసేందుకుగాను జరీమానాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని అబుదాబీ పోలీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జనరల్ ఆపరేషన్స్ - బ్రిగేడియర్ హుస్సేన్ అల్ హార్తి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







