ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- November 17, 2025
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హైదరాబాద్ విద్యానగర్ నల్లకుంటకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి నసీరుద్దీన్ (65) కుటుంబానికి చెందిన 18 మంది మృతిచెందారు. నసీరుద్దీన్, ఆయన భార్య ముగ్గురు కుమార్తెలు కుమారులు కోడళ్లు మరియు వారి పిల్లలు మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 10 మంది చిన్నపిల్లలు ఉన్నారు.
నసీరుద్దీన్ కుటుంబానికి శోకసమాఖ్యను వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అలాగే, ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ ప్రమాదం నేపథ్యంలో, సౌదీకి బీఆర్ఎస్ మైనార్టీ నేతల బృందం వెళ్లనుంది.బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు మాస్టార్ మంత్రులు మహమూద్ ఆలీ మరియు సీనియర్ నేతలతో కలిసి సౌదీకి వెళ్లాలని కేటీఆర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







