దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- November 21, 2025
దుబాయ్: దుబాయ్లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో పాల్గొన్న తేజస్ యుద్దవిమానం శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలిపోయిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. HAL తయారు చేసిన ఈ యుద్ద విమానం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ ఫో చేస్తుండగా అదుపు తప్పి తేజస్ యుద్దవిమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని..అలాగే భారీ ఎత్తున పొగలు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్ని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రదర్శనను వచ్చిన ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమానం నడుపుతున్న పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడ లేదా ఫ్లైట్లోనే ఉండిపోయాడా అనేది స్పష్టం కాలేదు. అతని ఆచూకీ గురించి అధికారులు గాలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









