అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- November 23, 2025
అమరావతి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై ముఖ్యమైన అప్డేట్ వెలువడింది.ఎన్టీఆర్ జిల్లా గ్రామాల నుంచి 3 ఏ ప్రతిపాదనలు ఇప్పటికే జాతీయ రహదారుల అధికారుల దృష్టికి చేరాయి. సోమవారం నాటికి కృష్ణా జిల్లా గ్రామాల ప్రతిపాదనలు కూడా సమర్పించనుండగా, వీటిని పరిశీలించిన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రోడ్ ప్రాజెక్ట్ ఏలూరు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడనుంది. ప్రతిపాదనల్లో భూమి వివరాలు, సర్వే నంబర్లు, రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమి పరిమాణం వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి.
190 కిలోమీటర్ల పొడవుతో
ప్రతిపాదనలను జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు వారి పోర్టల్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత డిల్లీలోని NHAI కార్యాలయానికి మరియు రోడ్లు, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు సమర్పిస్తారు. ఇప్పటికే ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లా ప్రతిపాదనలు డిల్లీలో ఆమోదం పొందాయి. మరికొద్ది రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రతిపాదనల సమీక్ష కూడా పూర్తి చేసి, ఆమోదం తర్వాత భూసేకరణను ప్రారంభించనున్నారు.
ఈ ఓఆర్ఆర్ నిర్మాణం 97 గ్రామాల మీదుగా ఆరు వరుసల రోడ్లుగా, మొత్తం 190 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.24,791 కోట్లుగా అంచనా వేయబడింది. నిర్మాణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమరావతి ప్రాంతంలో రవాణా మరింత సులభమవుతుంది, పట్టణాల మధ్య ట్రాఫిక్ కష్టాలు తగ్గి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం అవుతుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







