కృష్ణా పుష్కరాల లో పడవ అంబులెన్సులు
- July 25, 2016
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ దుర్గాఘాట్ వద్ద రెండు బోట్ అంబులెన్స్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. పుష్కరాల్లో వైద్య సదుపాయాలపై ఆయన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో భాగంగా 12 ర్యాపిడ్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ, ఏ ప్లస్ ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తాయన్నారు. పుష్కర్నగర్లో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









