కృష్ణా పుష్కరాల లో పడవ అంబులెన్సులు

- July 25, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాల లో పడవ అంబులెన్సులు

కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ దుర్గాఘాట్‌ వద్ద రెండు బోట్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ వెల్లడించారు. పుష్కరాల్లో వైద్య సదుపాయాలపై ఆయన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో భాగంగా 12 ర్యాపిడ్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏ, ఏ ప్లస్‌ ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తాయన్నారు. పుష్కర్‌నగర్‌లో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com