ఏవియేషన్ హబ్గా భారత్
- November 26, 2025
హైదరాబాద్: భారత్ ఏవియేషన్ హాబ్ గా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోడీ బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరో పార్క్లో సాఫ్రాన్ ఏర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ హైదరాబాద్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…భారత ఏవియేషన్ రంగం గత కొన్నేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఇప్పటికే 1500కి పైగా ఎయిర్క్రాఫ్ట్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. భారత్లోనే ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ MRO సెంటర్ ఏర్పాటు దేశానికి భారీ ప్రయోజనం చేకూరుస్తుందని, సాఫ్రాన్ సంస్థకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. MSMEలను ప్రోత్సహించే విధానంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. భారత్లో సాఫ్రాన్ యొక్క అతిపెద్ద MRO యూనిట్గా ఈ ఫెసిలిటీ నిలుస్తుందని, వేలాది మందికి స్కిల్డ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









