70 రోజుల మెటర్నిటీ సెలవులు..!!
- November 29, 2025
మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలోని మహిళలకు డెబ్బై రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పార్లమెంటును తాకాయి. ఎంపీలు హనన్ ఫర్దాన్, జలీలా అలావి, బాసెమా ముబారక్ మరియు మరియం అల్ సేగ్ సౌదీ మరియు ఈజిప్టు చట్టాలకు అనుగుణంగా ప్రస్తుత 60 రోజుల మెటర్నీ లీవులను పొడిగించాలని ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.
అలాగే,బహ్రెయిన్ తల్లికి తన బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రోజుకు రెండు వేతనంతో కూడిన నర్సింగ్ అవర్స్ ను పొందుతారు. ఆమె ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను చూసుకోవడానికి, ఒకేసారి రెండు సంవత్సరాల వరకు మరియు ఆమె సర్వీస్ సమయంలో మూడు సార్లు సాలరీ లేని పిల్లల సంరక్షణ సెలవును కూడా పొందే అవకాశం ఉంది.
మరోవైపు, మెటర్నిటీ సెలవులను పొడిగించడం కారణంగా ప్రభుత్వ సంస్థల సాధారణ నిర్వహణపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని బ్యూరో పేర్కొంది. ఎందుకంటే ఎక్కువ కాలం గైర్హాజరు అయితే అదనపు సిబ్బంది ద్వారా లేదా పనిని ఎలా పంచుకోవాలో మార్పుల ద్వారా కవర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. సివిల్ సర్వీస్ వర్క్ఫోర్స్లో మహిళలు 57.5 శాతం ఉన్నారని, అధిక ఖర్చులు మరియు అదనపు ఖర్చులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదన అమలుకు చట్టాల సవరణ అవసరమని వెల్లడించింది. త్వరలో బహ్రెయిన్ పార్లమెంట్ మెటర్నిటీ సెలవులపై చర్చిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







