థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి
- November 29, 2025
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు బాగా పెరుగుతున్నాయి.ఒకవైపు భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం, క్లౌడ్ బరస్ట్, అధిక వర్షాలతో వరదలు, (Floods) సునామీ వంటివాటితో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. తాజాగా థాయ్ లాండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
సౌత్ థాయ్ లాండ్ లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావానికి ఏకంగా 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అనేకమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యంతో థాయ్ లాండ్ చిగురుటాకులా ఒణికిపోతున్నది. ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి, తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నారు. భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోవడంతో శిధిలాలకింద ప్రజలు చిక్కుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శిథిలాల్లో చాలామంది చిక్కుకు పోయారు. దీంతో వాళ్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని
అధికారులు చెబుతున్నారు. రవాణ పూర్తి స్తంభించిపోవడంతో ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతాలకు సంబంధాలు కూడా తెగిపోయాయి. నదులు, చెరువులు వరద నీటితో నిండిపోయి, పలు ఇళ్ల వరదల్లో మునిగిపోయాయి.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







