యూఏఈలోని ఇండియన్ ప్రాపర్టీ యజమానులకు ట్యాక్స్ అలెర్టులు..!!
- November 29, 2025
యూఏఈ: యూఏఈలో ఉన్న వాటితో సహా విదేశాలలో ప్రాపర్టీని కలిగి ఉన్న లేదా ఆర్థిక ఖాతాలను నిర్వహించే వేలాది మంది భారతీయులు, భారత ఆదాయపు పన్ను శాఖ నుండి SMS మరియు ఇమెయిల్ నడ్జ్ అలెర్టులను అందుకుంటున్నారు. డిసెంబర్ 31 నాటికి భారతీయ పన్ను రిటర్న్లో అన్ని విదేశీ ఆస్తులను ప్రకటించాలని లేదా భారీ జరిమానాలను ఎదుర్కోవల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
అయితే, భారతీయ పన్ను నివాసితులు కాని మరియు భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లు (ITRలు) దాఖలు చేయని ప్రవాస భారతీయులకు (NRIలు) వర్తించదని పేర్కొంది. ఈ NRIలు విదేశీ ఆస్తులను ప్రకటించాల్సిన అవసరం లేదని, వారికి నడ్జ్ హెచ్చరికలు అందవని తెలిపింది.
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) డేటాను విశ్లేషించిన తర్వాత, 2025–26 అసెస్మెంట్ ఇయర్ (AY) కోసం వారి తాజా రిటర్న్లలో ప్రకటించిన దానితో సరిపోలని దాదాపు 25,000 మంది హై-రిస్క్ పన్ను చెల్లింపుదారులను గుర్తించినట్టు తెలిపింది.
ఇక ఫారీన్ లో ఉన్న ఆస్తులను వెల్లడించడంలో విఫలమైతే ఒక మిలియన్ భారతీయ రూపాయల జరిమానా (సుమారు దిర్హామ్లు 41,000), నివేదించని ఆదాయంపై 30 శాతం పన్ను మరియు చెల్లించాల్సిన పన్నులో 300 శాతం వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు.
నవంబర్ 2024లో జరిగిన మొదటి నడ్జ్ ప్రచారం సందర్భంగా.. CBDT గణాంకాల ప్రకారం, 24,678 మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ లను సమీక్షించమని కోరిన తర్వాత Dh12 బిలియన్లు మరియు Dh448 మిలియన్లు విదేశీ వనరుల ఆదాయాన్ని వెల్లడించారు. దుబాయ్ ప్రధాన హాట్స్పాట్లలో ఒకటిగా ఎదుగుతోందని భారతీయ మీడియా సంస్థలు మరియు పన్ను నిపుణులు అంటున్నారు.
అనేక సంవత్సరాలుగా దుబాయ్లో విదేశీ ప్రాపర్టీ కొనుగోలుదారుల జాబితాలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలు మరియు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం, 2024లో భారతీయ కొనుగోలుదారులు దుబాయ్ ఆస్తి లావాదేవీలలో 22 శాతం వాటా కలిగి ఉన్నారు. దాదాపు Dh150 బిలియన్లు పెట్టుబడి పెట్టారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







