రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- November 30, 2025
తమిళనాడు: తమిళనాడులో మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన చోటుచేసుకుంది. శివగంగా జిల్లాలో ఆదివారం ఉదయం రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా వేగంగా ప్రయాణిస్తుండగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదం రాష్ట్ర రాజధాని చెన్నైకి సుమారు 460 కిలోమీటర్ల దూరంలో, తిరుపత్తూరు సమీపంలోని పిల్లయార్పట్టి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో జరిగింది.ఢీకొట్టుకున్న ప్రాభల్యం వల్ల బస్సులు పూర్తిగా నలిగిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను కట్టర్లు, యంత్రాల సహాయంతో బయటకు తీశారు. రహదారి అంతా రక్తసిక్తంగా మారిపోయింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం,ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుప్పూర్ నుండి కరైకుడికి బయలుదేరిన బస్సు ఒకటి, కరైకుడి నుండి దిండిగల్ వైపు ప్రయాణిస్తున్న మరొక బస్సు ఈ ఘోర ప్రమాదానికి గురయ్యాయి.ఢీకొట్టుకున్న వేగం కారణంగా కొందరు మహిళలు భయంతో బస్సు కిటికీల నుంచి బయటకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆసుపత్రికి తరలించిన గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదానికి అసలు కారణం ఏమిటి?—అనే దానిపై పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, రహదారి పరిస్థితి…ఏ అంశం ప్రమాదానికి దారితీసిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తున్నారు.
అత్యవసర సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స ప్రారంభించారు. జిల్లా పరిపాలన పరిస్థితిని దగ్గర నుండి మానిటర్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







