తులసితో కిడ్నీలో రాళ్లు మాయం
- July 18, 2015
మన పెరట్లో సులువుగా పెరిగే తులసితో ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు. తులసి గాలిని పీల్చడం వల్ల గాలి ద్వారా వచ్చే అనేక రోగాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ తులసి ఆకుల రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు దూరం అవుతాయని శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడైంది. పది తులసి ఆకులను మరుగుతున్న నీటిలో వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. తరువాత ఆ నీటిని ప్రతిరోజూ తీసుకుంటే క్రమక్రమంగా కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. జలుబు, జ్వరం గొంతు నొప్పి లాంటివి ఉంటే తులసి ఆకులను గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తులసిని తరచూ తీసుకోవడం వల్ల దంత సమస్యలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల పొడిలో కొద్దిగా ఆవ నూనె చేర్చి దానితో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వాపు, రక్తం కారడంలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసిలోని యాంటి బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు మన శరీరానికి సంబంధించిన అనేక రోగాలకు మంచి మందుగా పని చేస్తాయి. ఏవైనా పురుగులు కుట్టడం, వాటి వల్ల వచ్చే పుండ్లు మానడానికి కూడా తులసి రసం మంచి ఔషధంగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







