ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- December 04, 2025
రియాద్: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సౌదీల సంఖ్య దాదాపు 2.5 మిలియన్లకు పెరిగిందని సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి అహ్మద్ అల్-రాజి తెలిపారు. బుధవారం రియాద్లో జరిగిన బడ్జెట్ ఫోరం 2026లో ఆయన పాల్గొని వివరాలను వెల్లడించారు. కార్మిక మార్కెట్లో సౌదీ మహిళల భాగస్వామ్యం 2019లో 23 శాతంగా ఉండగా, ఇప్పుడు 34.5 శాతానికి చేరుకుందని ఆయన అన్నారు.
2020లో ప్రారంభించబడిన లేబర్ మార్కెట్ లక్ష్యాలలో 92 శాతం అమలు చేసినట్లు తెలిపారు. ఇది సౌదీలలో నిరుద్యోగ రేటును ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో 6.8 శాతానికి తగ్గించడానికి దోహదపడిందని ఆయన తెలిపారు. ఇది 2019లో 12 శాతం నుండి తగ్గిందని, 2030 నాటికి 7 శాతానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
జాతీయ స్థాయిలో ప్రతిభను పెంచడానికి ఇంజనీరింగ్, అకౌంటింగ్ మరియు ఫార్మసీ వంటి ప్రత్యేక రంగాలలో 30 కంటే ఎక్కువ ప్రొఫెషనల్ లో స్థానిక స్టూడెంట్స్ సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. నిర్ణయాలను జారీ చేసిందని అల్-రాజి పేర్కొన్నారు. ఈ ట్రేడ్ లలో పనిచేసే సౌదీల సంఖ్య 100 శాతానికి పైగా పెరిగి, కొన్ని రంగాలలో 300 శాతానికి చేరుకుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







