లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- December 06, 2025
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ (PAI) తన 2024 ఇండస్ట్రియల్ సర్వే నివేదిక ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 109,000 మంది కార్మికులను నియమించినప్పటికీ, కువైట్ కార్మికులు పారిశ్రామిక రంగంలోని శ్రామిక శక్తిలో 11% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక బలమైన జాతీయ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని PAI యాక్టింగ్ డైరెక్టర్ జనరల్, షామ్లాన్ అల్-జహ్దాలి తెలిపారు. అథారిటీ లైసెన్స్ పొందిన 741 పారిశ్రామిక సంస్థలను పరిశీలించివేసిట్లు వెల్లడించారు.
పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిందని అల్-జహ్దాలి నొక్కిచెప్పారు. 2023లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు విలువ KD 5.07 బిలియన్లకు చేరుకుందని వెల్లడించారు.
2023లో పారిశ్రామిక రంగం మొత్తం కార్మికుల పరిహారంలో 784.5 మిలియన్ కువైట్ దినార్లు చెల్లించిందని సర్వే వెల్లడించింది.అయితే, మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 11% మాత్రమే ఉన్న కువైట్ పౌరుల పరిమిత భాగస్వామ్యం ఒక ప్రధాన సవాలుగా మారిందని, ఈ రంగంలో జాతీయ కార్మిక భాగస్వామ్యాన్ని పెంచడానికి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







