లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- December 06, 2025
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ (PAI) తన 2024 ఇండస్ట్రియల్ సర్వే నివేదిక ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 109,000 మంది కార్మికులను నియమించినప్పటికీ, కువైట్ కార్మికులు పారిశ్రామిక రంగంలోని శ్రామిక శక్తిలో 11% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక బలమైన జాతీయ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని PAI యాక్టింగ్ డైరెక్టర్ జనరల్, షామ్లాన్ అల్-జహ్దాలి తెలిపారు. అథారిటీ లైసెన్స్ పొందిన 741 పారిశ్రామిక సంస్థలను పరిశీలించివేసిట్లు వెల్లడించారు.
పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిందని అల్-జహ్దాలి నొక్కిచెప్పారు. 2023లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు విలువ KD 5.07 బిలియన్లకు చేరుకుందని వెల్లడించారు.
2023లో పారిశ్రామిక రంగం మొత్తం కార్మికుల పరిహారంలో 784.5 మిలియన్ కువైట్ దినార్లు చెల్లించిందని సర్వే వెల్లడించింది.అయితే, మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 11% మాత్రమే ఉన్న కువైట్ పౌరుల పరిమిత భాగస్వామ్యం ఒక ప్రధాన సవాలుగా మారిందని, ఈ రంగంలో జాతీయ కార్మిక భాగస్వామ్యాన్ని పెంచడానికి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









