కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- December 07, 2025
కువైట్: కువైట్ లో భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వాటి పంపిణీ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్టు మాదకద్రవ్య నియంత్రణ డైరెక్టరేట్ తెలిపింది. కచ్చితమైన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఇంటిరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఒక నిందితుడు, ఈ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ అని వెల్లడించారు. అతను ఓ క్రిమినల్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ దందాను నడుపుతున్నట్లు తెలిపారు.
అనుమానితులలో ఒకరిపై ఫోకస్ పెట్టిన భద్రతా బృందాలు, అతడిని వెస్ట్ అబ్దుల్లా అల్-ముబారక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారించింది.అతడిచ్చిన సమాచారం మేరకు అల్-సల్మి ఎడారిలోని ఒక ప్రైవేట్ శిబిరంపై రైడ్స్ చేశారు.అక్కడి నుంచి 40 కిలోగ్రాముల రసాయన పదార్ధం, 60 కిలోగ్రాముల లిరికా పౌడర్, 8 కిలోగ్రాముల గంజాయి, 500 గ్రాముల హషీష్, 5 లీటర్ల క్రిస్టల్ మెత్, 300 లీటర్ల రసాయన ద్రవం, 7 కిలోగ్రాముల రసాయన పేపర్ తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే మెషినరీని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







