స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- December 08, 2025
అమరావతి: గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ ఆందోళన కలిగిస్తోంది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మహిళలు ఆదివారం మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరణించినవారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ (73) ఉన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లూరమ్మ నవంబర్ 28న జీజీహెచ్లో చేరారు. ఆమెకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రమ్మ కూడా తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇదే వ్యాధితో శనివారం రాత్రి మరొక మహిళ ధనమ్మ (64), ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన వారు, మరణించిన సంగతి తెలిసిందే.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు గ్రామాల్లో పర్యటిస్తూ లార్వా నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







