స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- December 08, 2025
అమరావతి: గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ ఆందోళన కలిగిస్తోంది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మహిళలు ఆదివారం మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరణించినవారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ (73) ఉన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లూరమ్మ నవంబర్ 28న జీజీహెచ్లో చేరారు. ఆమెకు ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రమ్మ కూడా తీవ్ర జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇదే వ్యాధితో శనివారం రాత్రి మరొక మహిళ ధనమ్మ (64), ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన వారు, మరణించిన సంగతి తెలిసిందే.
ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు గ్రామాల్లో పర్యటిస్తూ లార్వా నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









