కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- March 10, 2026
కువైట్ః ప్రాంతీయ పరిణామాల మధ్య భారతీయ పౌరులకు సహాయం చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి.. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కువైట్ ఎటువంటి భారీ దాడులను లేదా తీవ్ర ఆందోళన కలిగించే పరిణామాలను ఎదుర్కోలేదని రాయబారి భరోసా ఇచ్చారు.
కువైట్ వైమానిక ప్రాంతం మరికొన్ని రోజులు మూసివేయబడుతుందని భావిస్తున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. కమ్యూనిటీ వాలంటీర్లు మరియు సంస్థల మద్దతుతో రాయబార కార్యాలయం అనేక మంది ప్రయాణీకులను వారి స్వదేశానికి తిరిగి పంపడానికి సహాయం అందించగలిగిందని ఆమె వెల్లడించారు. తమకు మద్దతుగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం కువైట్లో ఉన్న సందర్శకులకు సంబంధించి ప్రభుత్వం జరిమానాలు లేదా అదనపు రుసుములు లేకుండా సందర్శన వీసాలను ఒక నెల పాటు పొడిగించిందని గుర్తుచేశారు.అయితే, వ్యక్తిగత లేదా అత్యవసర కారణాలు ఉన్నవారిని సౌదీ అరేబియా ద్వారా పంపడానికి రాయబార కార్యాలయం కృషి చేస్తోందన్నారు.
ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న నివాసితులు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ పొందాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత వివరాలను [email protected] వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి పంపాలని కోరారు.
కువైట్లోని రాయబార కార్యాలయం న్యూఢిల్లీలోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అలాగే ఈ ప్రాంతంలోని భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







