కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- March 10, 2026
కువైట్ః ప్రాంతీయ పరిణామాల మధ్య భారతీయ పౌరులకు సహాయం చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కువైట్లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి.. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కువైట్ ఎటువంటి భారీ దాడులను లేదా తీవ్ర ఆందోళన కలిగించే పరిణామాలను ఎదుర్కోలేదని రాయబారి భరోసా ఇచ్చారు.
కువైట్ వైమానిక ప్రాంతం మరికొన్ని రోజులు మూసివేయబడుతుందని భావిస్తున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. కమ్యూనిటీ వాలంటీర్లు మరియు సంస్థల మద్దతుతో రాయబార కార్యాలయం అనేక మంది ప్రయాణీకులను వారి స్వదేశానికి తిరిగి పంపడానికి సహాయం అందించగలిగిందని ఆమె వెల్లడించారు. తమకు మద్దతుగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం కువైట్లో ఉన్న సందర్శకులకు సంబంధించి ప్రభుత్వం జరిమానాలు లేదా అదనపు రుసుములు లేకుండా సందర్శన వీసాలను ఒక నెల పాటు పొడిగించిందని గుర్తుచేశారు.అయితే, వ్యక్తిగత లేదా అత్యవసర కారణాలు ఉన్నవారిని సౌదీ అరేబియా ద్వారా పంపడానికి రాయబార కార్యాలయం కృషి చేస్తోందన్నారు.
ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న నివాసితులు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ పొందాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత వివరాలను [email protected] వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి పంపాలని కోరారు.
కువైట్లోని రాయబార కార్యాలయం న్యూఢిల్లీలోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అలాగే ఈ ప్రాంతంలోని భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









