యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- December 12, 2025
మనామా: భారత దీపాల పండుగ దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరింది. భారత రాజధాని న్యూఢిల్లీలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 78 దేశాల నుండి డజన్ల కొద్దీ నామినేషన్లను పరిశీలిస్తోంది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా, లక్షలాది మంది భారతీయులు జరుపుకునే పండుగగా దీపావళికి ప్రత్యేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపింది. సిక్కు మరియు జైన మత వర్గాలకు చెందిన వారితో సహా చాలా మంది దీనిని ఐదు రోజుల పండుగగా పాటిస్తారని, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యునెస్కో జాబితాలో దీపావళి చేరడం "ఆనందకరమైన క్షణం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









