యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- December 12, 2025
మనామా: భారత దీపాల పండుగ దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరింది. భారత రాజధాని న్యూఢిల్లీలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 78 దేశాల నుండి డజన్ల కొద్దీ నామినేషన్లను పరిశీలిస్తోంది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా, లక్షలాది మంది భారతీయులు జరుపుకునే పండుగగా దీపావళికి ప్రత్యేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపింది. సిక్కు మరియు జైన మత వర్గాలకు చెందిన వారితో సహా చాలా మంది దీనిని ఐదు రోజుల పండుగగా పాటిస్తారని, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యునెస్కో జాబితాలో దీపావళి చేరడం "ఆనందకరమైన క్షణం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









