యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- December 12, 2025
మనామా: భారత దీపాల పండుగ దీపావళి యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరింది. భారత రాజధాని న్యూఢిల్లీలో సమావేశమైన ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 78 దేశాల నుండి డజన్ల కొద్దీ నామినేషన్లను పరిశీలిస్తోంది. హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా, లక్షలాది మంది భారతీయులు జరుపుకునే పండుగగా దీపావళికి ప్రత్యేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపింది. సిక్కు మరియు జైన మత వర్గాలకు చెందిన వారితో సహా చాలా మంది దీనిని ఐదు రోజుల పండుగగా పాటిస్తారని, ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యునెస్కో జాబితాలో దీపావళి చేరడం "ఆనందకరమైన క్షణం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









