'దేవి' సెప్టెంబరు 9న
- July 26, 2016
చిత్ర పరిశ్రమలోని తారలకు 'తొమ్మిది' అంటే అభిమానం ఎక్కువ. ఇదే కోవలో సెప్టెంబరు తొమ్మిదో తేదీన తమ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతోంది 'దేవి' చిత్ర యూనిట్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్నారు. ప్రభుదేవా సొంత బ్యానరైన 'ప్రభుదేవా స్టూడియోస్', గణేశ్ నిర్మాణంలోని 'ఆరా సినిమాస్' సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కొనసాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఇది ఓ భిన్న కథని దర్శకుడు విజయ్ చెప్పారు. అందరి సహకారంతో మూడు భాషల్లోనూ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







