గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- December 13, 2025
మనామా: బహ్రెయిన్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న ఒక రెస్టారెంట్ యజమానికి క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించారు. అలాగే, ఇంటి నుండి లైసెన్స్ లేకుండా కిచెన్ నడుపుతున్నందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD7,200 జరిమానా విధించారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేని వస్తువులను ఉపయోగించినందుకు రెస్టారెంట్ యజమానిని దోషిగా నిర్ధారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. రెస్టారెంట్లోని ఒక ఉద్యోగి నుండి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపినట్టు వెల్లడించింది.
అధికారులు రెస్టారెంట్ ను తనిఖీ చేయగా, గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, బూజు పట్టిన ఆహారం, తెలియని కంపెనీలకు చెందిన వస్తువులు మరియు లైసెన్స్ లేకుండా ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









