గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!

- December 13, 2025 , by Maagulf
గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!

మనామా: బహ్రెయిన్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న ఒక రెస్టారెంట్ యజమానికి క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించారు. అలాగే, ఇంటి నుండి లైసెన్స్ లేకుండా కిచెన్ నడుపుతున్నందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD7,200 జరిమానా విధించారు. 

గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేని వస్తువులను ఉపయోగించినందుకు రెస్టారెంట్ యజమానిని దోషిగా నిర్ధారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. రెస్టారెంట్‌లోని ఒక ఉద్యోగి నుండి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపినట్టు వెల్లడించింది.    

అధికారులు రెస్టారెంట్ ను తనిఖీ చేయగా, గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, బూజు పట్టిన ఆహారం, తెలియని కంపెనీలకు చెందిన వస్తువులు మరియు లైసెన్స్ లేకుండా ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com