తెలంగాణ సాయిలు సౌదీలో తిప్పలు ..
- July 26, 2016
మండలంలోని నల్లవెల్లికి చెందిన గూండ్ల గడ్డమీది సాయిలు(35) సౌదీ అరేబియా దేశంలోని దమామ్ నగరంలో తప్పిపోయి తిప్పలు పడుతున్నాడు. కుటుంబ భారాన్ని పోషించేందుకు ఆరేళ్ల క్రితం కూలీ పని చేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇతడికి వీసా ఇచ్చిన కంపెనీ వారు ఎవరూ రాకపోవడంతో ఎయిర్పోర్ట్లో దిగి తప్పి పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. సాయిలుకు తల్లీ సాయవ్వ, భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
సౌదీ అరేబియాలో రోడ్డు వెంట దొరికింది తింటూ బతుకుతున్నట్లు సాయిలు భార్యకు రెండు సార్లు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. తమ భర్తను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కుటుంబ పెద్ద దిక్కు లేక తాము పూట గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు సాయిలును రప్పించి తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







