రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- December 13, 2025
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నాడు జరిగిన ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మరియు సిబ్బందిని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి అభినందించారు.ఎలాంటి చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డిజిపి ప్రశంసించారు.ఈ సందర్భంగా డిజిపి బి. శివధర్ రెడ్డి స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో తాము భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా, శనివారం ఉదయం కోల్కతాలో జరిగిన ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డిజిపి వివరించారు.అభిమానులు ఎవరూ గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి, గ్రౌండ్ చుట్టూ రోప్ పార్టీలను నియమించి పటిష్ట బందోబస్తు నిర్వహించామని డిజిపి పేర్కొన్నారు.ఈ కార్యక్రమ విజయంలో సహకరించిన ఫుట్బాల్ క్రీడాభిమానులకు, మెస్సీ అభిమానులకు కూడా డిజిపి బి.శివధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









