రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి

- December 13, 2025 , by Maagulf
రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నాడు జరిగిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మరియు సిబ్బందిని  డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి అభినందించారు.ఎలాంటి చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని, వారికి సహకరించిన ఇతర పోలీసు అధికారులను డిజిపి ప్రశంసించారు.ఈ సందర్భంగా డిజిపి బి. శివధర్ రెడ్డి స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో తాము భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా, శనివారం ఉదయం కోల్‌కతాలో జరిగిన  ఘటనతో అప్రమత్తమై, అక్కడ జరిగిన లోపాలు తెలుసుకుని, ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని డిజిపి వివరించారు.అభిమానులు ఎవరూ గ్రౌండ్ లోపలికి వెళ్లకుండా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసి, గ్రౌండ్ చుట్టూ రోప్ పార్టీలను నియమించి పటిష్ట బందోబస్తు నిర్వహించామని డిజిపి పేర్కొన్నారు.ఈ కార్యక్రమ విజయంలో సహకరించిన ఫుట్‌బాల్  క్రీడాభిమానులకు, మెస్సీ అభిమానులకు కూడా డిజిపి బి.శివధర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com