భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- December 14, 2025
కువైట్: భారతదేశంలోని ముంబైలో జరిగిన “నెట్వర్క్స్ ఆఫ్ ది పాస్ట్” గ్యాలరీలో కువైట్లోని దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా ఆధ్వర్యంలోని అల్-సబా పురావస్తు సేకరణలను ప్రదర్శిస్తున్నారు. “ఇండియా అండ్ యాన్షియెంట్ వరల్డ్” అనే టైటిల్ తో ఉన్న ఈ గ్యాలరీని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ నిర్వహిస్తోంది. ఇది ప్రాచీన నాగరికతల చారిత్రక పరస్పర సంబంధాన్ని తెలియజేస్తుందని కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన జాతీయ సంస్కృతి, కళలు మరియు సాహిత్యం మండలి (NCCAL) సెక్రటరీ జనరల్ డాక్టర్ మొహమ్మద్ ఖలీద్ అల్-జస్సార్ తెలిపారు.
అల్-సబా సేకరణలో అత్యుత్తమ కళాత్మక మరియు చారిత్రక ప్రాముఖ్యత కారణంగా విశిష్టమైన అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అల్-జస్సార్ పేర్కొన్నారు. ఈ అరుదైన కళాఖండాలను ప్రముఖ అంతర్జాతీయ మ్యూజియంలలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచినందుకు దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మరియు దాని డైరెక్టర్ జనరల్ షేఖా హెసా సబా అల్-సలేం అల్-సబాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవానికి ముంబైలోని కువైట్ కాన్సుల్ జనరల్ ఇమాద్ అబ్దుల్ అజీజ్ అల్-ఖర్రాజ్, అల్-సబా పురావస్తు సేకరణ డైరెక్టర్ సలాం కవ్క్జీ, దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మరియు అల్-సబా పురావస్తు సేకరణ నుండి వచ్చిన అధికారిక ప్రతినిధి బృందం కూడా హాజరయ్యారు.
ఈ ప్రదర్శన సింధు లోయ (హరప్పా) నాగరికతతో పాటు ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్ మరియు చైనా తదితర దేశాలకు చెందిన మానవ నాగరికత అభివృద్ధిలో కీలక దశలలో భాగస్వామ్యమైన వస్తువులను చూడవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









