భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- December 14, 2025
కువైట్: భారతదేశంలోని ముంబైలో జరిగిన “నెట్వర్క్స్ ఆఫ్ ది పాస్ట్” గ్యాలరీలో కువైట్లోని దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా ఆధ్వర్యంలోని అల్-సబా పురావస్తు సేకరణలను ప్రదర్శిస్తున్నారు. “ఇండియా అండ్ యాన్షియెంట్ వరల్డ్” అనే టైటిల్ తో ఉన్న ఈ గ్యాలరీని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ నిర్వహిస్తోంది. ఇది ప్రాచీన నాగరికతల చారిత్రక పరస్పర సంబంధాన్ని తెలియజేస్తుందని కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన జాతీయ సంస్కృతి, కళలు మరియు సాహిత్యం మండలి (NCCAL) సెక్రటరీ జనరల్ డాక్టర్ మొహమ్మద్ ఖలీద్ అల్-జస్సార్ తెలిపారు.
అల్-సబా సేకరణలో అత్యుత్తమ కళాత్మక మరియు చారిత్రక ప్రాముఖ్యత కారణంగా విశిష్టమైన అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అల్-జస్సార్ పేర్కొన్నారు. ఈ అరుదైన కళాఖండాలను ప్రముఖ అంతర్జాతీయ మ్యూజియంలలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచినందుకు దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మరియు దాని డైరెక్టర్ జనరల్ షేఖా హెసా సబా అల్-సలేం అల్-సబాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవానికి ముంబైలోని కువైట్ కాన్సుల్ జనరల్ ఇమాద్ అబ్దుల్ అజీజ్ అల్-ఖర్రాజ్, అల్-సబా పురావస్తు సేకరణ డైరెక్టర్ సలాం కవ్క్జీ, దార్ అల్-అథర్ అల్-ఇస్లామియా మరియు అల్-సబా పురావస్తు సేకరణ నుండి వచ్చిన అధికారిక ప్రతినిధి బృందం కూడా హాజరయ్యారు.
ఈ ప్రదర్శన సింధు లోయ (హరప్పా) నాగరికతతో పాటు ప్రాచీన ఈజిప్ట్, గ్రీస్ మరియు చైనా తదితర దేశాలకు చెందిన మానవ నాగరికత అభివృద్ధిలో కీలక దశలలో భాగస్వామ్యమైన వస్తువులను చూడవచ్చని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







