138 మంది టెర్రర్ అనుమానితులపై విచారణ
- July 26, 2016
బహ్రెయిన్ ప్రాజిక్యూటర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన అనుమానితులకు వచ్చే నెలలో ట్రయల్ ఉండవచ్చునని తెలిపారు. ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్, గల్ఫ్ కింగ్డమ్కి చెందిన పలువుర్ని కొత్త మొలిటెంట్ గ్రూప్ జుల్ఫికర్ బ్రిగేడ్స్ పేరుతో ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నించింది. దాని పట్ల ఆకర్షితులైన పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జుల్ఫికర్ బ్రిగేడ్స్ వివాదంలో విచారణ పూర్తి అయ్యిందనీ, దాన్ని న్యాయస్థానానికి సమర్పించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ తెలిపింది. ఇరాన్లోని ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే సంస్థలు బహ్రెయిన్లో అశాంతిని సృష్టించడానికి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని బహ్రెయిన్ ఆరోపిస్తోంది. వివిధ నేరారోపణల మీద మొత్తం 138 అనుమానితుల్ని కోర్టుకి ఈ మేరకు రిఫర్ చేశారు. వీరిలో 86 మంది అనుమానితులు కస్టడీలో ఉండగా, మిగతావారంతా ఇరాన్ లేదా ఇరాక్కి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







