హైదరాబాద్ యువతిని పెళ్లాడాలనుకున్న అబు జకారియా..
- July 27, 2016
నగరానికి చెందిన ఓ యువతితో సిరియాకు చెందిన ఇస్లామిక్(ఐస్) ఉగ్రవాద నేతలు సంప్రదింపులు జరిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పేర్కొంది. డిసెంబర్ 2015లో ఎన్ఐఏ అరెస్టు చేసిన తొమ్మిది మందిలో ఒకరి సోదరిగా ఈ యువతిని గుర్తించారు.
హైదరాబాద్లో పేలుళ్ల కుట్ర: ప్రధాన సూత్రధారి ఇంగ్లీష్ టీచర్!(పిక్చర్స్)
సిరియాకు చెందిన ఐసిస్ అగ్రనేత అబు జకారియా జిహాదీ మ్యాట్రిమోనీ వెబ్సైట్ను నడుపుతున్నాడు. దీని ద్వారా హైదరాబాద్లో ఉన్న ఐఎస్ సానుభూతిపరులతో గ్రూప్ డిస్కషన్స్ చేసేవాడు.ఈ క్రమంలో భాగంగానే సదరు యువతి సోదరుడితో పాటు ఆమెతో కూడా అతడు మాట్లాడుతుండేవాడు. మ్యాట్రిమోనీ ద్వారా ఐఎస్ ఐడియాలజీని వ్యాప్తి చేసేవాడు. అబు జకారియాతో పాటు మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.కాగా, కేసు విచారణలో భాగంగా విషయం తెలిసిన ఎన్ఐఏ అధికారులు యువతిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ అనంతరం విడిచిపెట్టారు. స్థానిక యువతులను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇరుదేశాల మధ్య సులువుగా ప్రయాణించవచ్చనే ఉద్ధేశంతోనే ఉగ్రవాదులు ఇలా వల వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇటీవల హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ అధికారులు తెలంగాణ పోలీసుల సాయంతో 11మంది ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందర్ని విచారించి వదిలేసింది. కాగా, ఈ ఉగ్ర సానుభూతిపరులు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







