ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- December 17, 2025
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తానేట్లో అధికారిక రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మస్కట్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో చర్చలు జరపనున్నారు. ప్రధానితో పాటు భారత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత్ లోని ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షైబానీ తెలిపారు.
మొత్తం ఎగుమతుల పరంగా ఒమన్ సుల్తానేట్కు భారత్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్ తెలిపారు. ఒమన్-భారత సంబంధాలు సక్సెస్ మోడల్ గా ఉన్నాయని, భారత్ ఒమన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నదని వెల్లడించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









