ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- December 17, 2025
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తానేట్లో అధికారిక రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మస్కట్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో చర్చలు జరపనున్నారు. ప్రధానితో పాటు భారత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత్ లోని ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షైబానీ తెలిపారు.
మొత్తం ఎగుమతుల పరంగా ఒమన్ సుల్తానేట్కు భారత్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్ తెలిపారు. ఒమన్-భారత సంబంధాలు సక్సెస్ మోడల్ గా ఉన్నాయని, భారత్ ఒమన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నదని వెల్లడించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







