ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- December 17, 2025
మస్కట్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తానేట్లో అధికారిక రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మస్కట్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో చర్చలు జరపనున్నారు. ప్రధానితో పాటు భారత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత్ లోని ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షైబానీ తెలిపారు.
మొత్తం ఎగుమతుల పరంగా ఒమన్ సుల్తానేట్కు భారత్ ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఫైసల్ అబ్దుల్లా అల్ రోవాస్ తెలిపారు. ఒమన్-భారత సంబంధాలు సక్సెస్ మోడల్ గా ఉన్నాయని, భారత్ ఒమన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం 10 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నదని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









