ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

- December 17, 2025 , by Maagulf
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ మంగళవారం ప్రధాని మోదీకి అందజేశారు. భారత్-ఇథియోపియా మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక ప్రాత పోశించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

దీంతో ప్రపంచంలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు. భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇథియోపియాకు చెందిన ‘గ్రేట్ హానర్ నిషాన్’ అవార్డును ప్రదానం చేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నాను” అని మోడీ Xలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (PM Modi) మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటైన ఈ అవార్డును స్వీకరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తాను దానిని లోతైన వినయం ,కృతజ్ఞతతో స్వీకరించానని ఆ ప్రకటన పేర్కొన్నారు. ఈ గౌరవానికి గాను ప్రధాని అబియ్, ఇథియోపియా ప్రజలకు ప్రధానమంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com