దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- December 17, 2025
దుబాయ్: దుబాయ్ లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ ను రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్లను డ్రోన్ల ద్వారా క్లీన్ చేయడాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మ్యాన్లిఫ్ట్ల అవసరాన్ని తొలగిస్తుందని, దాంతో సమయం, ఖర్చులు కలిసివస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఇంధనం మరియు నీటి వినియోగాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో RTA దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ స్టేషన్లలో బోర్డులను క్లీన్ చేసేందుకు డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్లీన్ చేసేందుకు ఉపయోగించనున్నట్లు RTAలోని రోడ్లు మరియు సౌకర్యాల నిర్వహణ డైరెక్టర్ అబ్దుల్లా అలీ లూతా తెలిపారు.
మొదటి దశలో మర్రాకేష్ స్ట్రీట్-రెబాట్ స్ట్రీట్ జంక్షన్లో ట్రయల్ రన్లు ఉన్నాయని, ఇక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేసి పనులను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు సిగ్నల్ ఒక వైపును కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల్లో క్లీన్ చేయగలవని, సమయాన్ని 25 నుండి 50 శాతం, ఖర్చులను 15 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో 25 శాతానికిపైగా ఖర్చులను ఆదా చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







