దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- December 17, 2025
దుబాయ్: దుబాయ్ లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ ను రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్లను డ్రోన్ల ద్వారా క్లీన్ చేయడాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మ్యాన్లిఫ్ట్ల అవసరాన్ని తొలగిస్తుందని, దాంతో సమయం, ఖర్చులు కలిసివస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఇంధనం మరియు నీటి వినియోగాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో RTA దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ స్టేషన్లలో బోర్డులను క్లీన్ చేసేందుకు డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్లీన్ చేసేందుకు ఉపయోగించనున్నట్లు RTAలోని రోడ్లు మరియు సౌకర్యాల నిర్వహణ డైరెక్టర్ అబ్దుల్లా అలీ లూతా తెలిపారు.
మొదటి దశలో మర్రాకేష్ స్ట్రీట్-రెబాట్ స్ట్రీట్ జంక్షన్లో ట్రయల్ రన్లు ఉన్నాయని, ఇక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేసి పనులను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు సిగ్నల్ ఒక వైపును కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల్లో క్లీన్ చేయగలవని, సమయాన్ని 25 నుండి 50 శాతం, ఖర్చులను 15 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో 25 శాతానికిపైగా ఖర్చులను ఆదా చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







