దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- December 17, 2025
దుబాయ్: దుబాయ్ లో కొత్త పైలట్ ప్రాజెక్ట్ ను రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్లను డ్రోన్ల ద్వారా క్లీన్ చేయడాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మ్యాన్లిఫ్ట్ల అవసరాన్ని తొలగిస్తుందని, దాంతో సమయం, ఖర్చులు కలిసివస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఇంధనం మరియు నీటి వినియోగాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో RTA దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ స్టేషన్లలో బోర్డులను క్లీన్ చేసేందుకు డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ను క్లీన్ చేసేందుకు ఉపయోగించనున్నట్లు RTAలోని రోడ్లు మరియు సౌకర్యాల నిర్వహణ డైరెక్టర్ అబ్దుల్లా అలీ లూతా తెలిపారు.
మొదటి దశలో మర్రాకేష్ స్ట్రీట్-రెబాట్ స్ట్రీట్ జంక్షన్లో ట్రయల్ రన్లు ఉన్నాయని, ఇక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ ను నిలిపివేసి పనులను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు సిగ్నల్ ఒక వైపును కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల్లో క్లీన్ చేయగలవని, సమయాన్ని 25 నుండి 50 శాతం, ఖర్చులను 15 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో 25 శాతానికిపైగా ఖర్చులను ఆదా చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









