రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- December 19, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ప్రోత్సాహించేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మార్కెట్ ధరల కంటే 84% వరకు రాయితీతో నివాస స్థలాలను రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ అందిస్తుంది. రియాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను స్థిరీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నివాస స్థలాల కోసం ఒక ఎలక్ట్రానిక్ లాటరీని నిర్వహిస్తుంది. ఇందులో చదరపు మీటరుకు SR1,500 స్థిర ధరను ఆఫర్ చేసింది. మొత్తం 10,024 నివాస స్థలాలను అల్-ఖిరావాన్, అల్-మల్కా, అల్-నఖీల్, అల్-నార్జిస్, నమర్, అల్-రిమాయా, అల్-రిమాల్ మరియు అల్-జనాద్రియా ఏరియాల్లో కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 6.38 మిలియన్ చదరపు మీటర్లు. ప్రతి ప్లాట్ 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.
తాజా ప్రకటించిన ధరలు నిర్దేశిత పరిసర ప్రాంతాలలో ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే 16% నుండి 84% వరకు తక్కువకే వస్తున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక ఈ ధరలు రియాద్ సగటు నివాస భూమి ధర కంటే 50% కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్ లో సుమారుగా చదరపు మీటరుకు SR3,200గా ఉందని తెలిపారు. అల్-ఖిరావాన్లో అత్యధికంగా 84% రాయితీ నమోదైంది. ఆ తర్వాత అల్-మల్కా, అల్-నార్జిస్లో 78%, అల్-రిమాల్లో 58%, మరియు అల్-జనాద్రియాలో 16% రాయితీ లభించిందని వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రాబోయే ఐదేళ్లలో ఏటా 10,000 నుండి 40,000 వరకు అభివృద్ధి చేసిన నివాస స్థలాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయల్ కమిషన్ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







