ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- December 20, 2025
దోహా: ఖతార్కు రెండు ఆసియా ఏనుగులను నేపాల్ బహుమతిగా ఇచ్చింది. ఆ రెండు ఆసియా ఏనుగులు అల్ ఖోర్ పార్క్కు చేరుకున్నాయని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బహుమతి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గాఢతకు మరియు స్నేహం, సహకార బంధాలకు ప్రతీక అని పేర్కొంది.
ఈ రెండు ఏనుగులు చిత్వాన్ నేషనల్ పార్క్లో జన్మించాయి. రుద్ర కాళి అనే ఆడ ఏనుగుకు ఏడు సంవత్సరాలు మరియు దాని బరువు 1,200 కిలోలు కాగా, ఖగేంద్ర ప్రసాద్ అనే మగ ఏనుగుకు ఆరు సంవత్సరాలు మరియు దాని బరువు 1,190 కిలోలు. అల్ ఖోర్ పార్క్లో ఆసియా ఏనుగులను చూడవచ్చని, ఓన్ అప్లికేషన్ లేదా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









