ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!

- December 20, 2025 , by Maagulf
ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!

దోహా: ఖతార్‌కు రెండు ఆసియా ఏనుగులను నేపాల్ బహుమతిగా ఇచ్చింది. ఆ రెండు ఆసియా ఏనుగులు అల్ ఖోర్ పార్క్‌కు చేరుకున్నాయని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బహుమతి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గాఢతకు మరియు స్నేహం, సహకార బంధాలకు ప్రతీక అని పేర్కొంది.

ఈ రెండు ఏనుగులు చిత్వాన్ నేషనల్ పార్క్‌లో జన్మించాయి. రుద్ర కాళి అనే ఆడ ఏనుగుకు ఏడు సంవత్సరాలు మరియు దాని బరువు 1,200 కిలోలు కాగా, ఖగేంద్ర ప్రసాద్ అనే మగ ఏనుగుకు ఆరు సంవత్సరాలు మరియు దాని బరువు 1,190 కిలోలు. అల్ ఖోర్ పార్క్‌లో ఆసియా ఏనుగులను చూడవచ్చని, ఓన్ అప్లికేషన్ లేదా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com