ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- December 20, 2025
దోహా: ఖతార్కు రెండు ఆసియా ఏనుగులను నేపాల్ బహుమతిగా ఇచ్చింది. ఆ రెండు ఆసియా ఏనుగులు అల్ ఖోర్ పార్క్కు చేరుకున్నాయని మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బహుమతి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గాఢతకు మరియు స్నేహం, సహకార బంధాలకు ప్రతీక అని పేర్కొంది.
ఈ రెండు ఏనుగులు చిత్వాన్ నేషనల్ పార్క్లో జన్మించాయి. రుద్ర కాళి అనే ఆడ ఏనుగుకు ఏడు సంవత్సరాలు మరియు దాని బరువు 1,200 కిలోలు కాగా, ఖగేంద్ర ప్రసాద్ అనే మగ ఏనుగుకు ఆరు సంవత్సరాలు మరియు దాని బరువు 1,190 కిలోలు. అల్ ఖోర్ పార్క్లో ఆసియా ఏనుగులను చూడవచ్చని, ఓన్ అప్లికేషన్ లేదా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









