బంగాళాఖాతంలో కొన్ని శకలాలు లభ్యం
- July 27, 2016
బంగాళాఖాతంలో కొన్ని శకలాలు కనిపించాయని కాగా అవి అదృశ్యమైన ఏఎన్-32 విమానానికి చెందినవి అవునో.. కాదో తేల్చాల్సి వుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 29 మంది రక్షణ సిబ్బందితో తాంబరం నుంచి పోర్ట్బ్లెయిర్కు వెళ్తున్న ఏఎన్-32 విమానం జులై 22న కనిపించకుండా పోయింది. టేకాఫ్ అయిన 16 నిమిషాలకే రాడార్ నుంచి అదృశ్యమైంది. 'దేని గురించీ కచ్చితమైన నివేదికలు లేవు. కానీ కొన్ని శకలాలు గుర్తించాం. అవి ఏఎన్-32 విమానానికి చెందినవా.. కావా నిర్ధారించాల్సిందిగా అధికారుల్ని కోరాం' అని పారికర్ తెలిపారు.
అదృశ్యమైన విమానం జాడ కనుక్కునేందుకు భారత నేవీ, కోస్ట్గార్డ్కు చెందిన 17 నౌకలు, 23 విమానాలు అన్వేషణ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో సాయపడేందుకు మారిషస్లోని సాగర్ నిధి సంస్థను కోరినట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







