ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- January 02, 2026
మస్కట్: ఒమన్ పౌరులందరికీ ప్రీ మారిటల్ వైద్య పరీక్షలను తప్పనిసరి చేశారు. కొత్త నిబంధన జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వధూవరులలో ఒకరు ఒమాన్ పౌరులు కాకపోయినా, లేదా వివాహం సుల్తానేట్ లోపల లేదా వెలుపల జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి అంటువ్యాధులను నియంత్రించడం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వంశపారంపర్య మరియు అంటు వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల అనారోగ్యంతో పిల్లలు పుట్టడాన్ని తగ్గించవచ్చని, ఇలాంటివి కుటుంబాలపై ఆరోగ్య, సామాజిక, మానసిక మరియు ఆర్థిక భారాలను మోపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 1999 నుండి ప్రీ మారిటల్ స్క్రీనింగ్ ఐచ్ఛికంగా ఉందని, అయితే 2025లో కేవలం 42 శాతం మంది మాత్రమే ఇందులో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో కుటుంబ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ఈ వ్యాధుల నుండి సమాజాన్ని రక్షించడానికి దీనిని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









