ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- January 02, 2026
మస్కట్: ఒమన్ పౌరులందరికీ ప్రీ మారిటల్ వైద్య పరీక్షలను తప్పనిసరి చేశారు. కొత్త నిబంధన జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వధూవరులలో ఒకరు ఒమాన్ పౌరులు కాకపోయినా, లేదా వివాహం సుల్తానేట్ లోపల లేదా వెలుపల జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి అంటువ్యాధులను నియంత్రించడం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వంశపారంపర్య మరియు అంటు వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల అనారోగ్యంతో పిల్లలు పుట్టడాన్ని తగ్గించవచ్చని, ఇలాంటివి కుటుంబాలపై ఆరోగ్య, సామాజిక, మానసిక మరియు ఆర్థిక భారాలను మోపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 1999 నుండి ప్రీ మారిటల్ స్క్రీనింగ్ ఐచ్ఛికంగా ఉందని, అయితే 2025లో కేవలం 42 శాతం మంది మాత్రమే ఇందులో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో కుటుంబ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ఈ వ్యాధుల నుండి సమాజాన్ని రక్షించడానికి దీనిని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







