లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- January 02, 2026
దోహా: ఖతార్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా లుసైల్ నగరం అందరి దృష్టిని ఆకర్షించింది. లుసైల్ బౌలేవార్డ్ సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖతార్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫైర్ వర్క్స్ ప్రదర్శనతో ఆకాశం వెలిగిపోయింది. 250,000 మందికి పైగా పౌరులు, నివాసితులు ఒక అద్భుతమైన వేడుకతో అధికారికంగా 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు అధునాతన లేజర్ లైట్ షోలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు లైవ్ మ్యూజిక్ కాన్సర్టులు కొనసాగాయి. ఒక ప్రత్యేకమైన డ్రోన్ షోలో 46 వేర్వేరు ప్రదేశాల నుండి 1,000 "పైరోడ్రోన్" యూనిట్ల ద్వారా ప్రయోగించిన 4,000 పైరోటెక్నిక్ షాట్లు ప్రదర్శించారు. దీంతోపాటు నిర్వహించిన ఫైర్ వర్క్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్ నగరంగా లుసైల్ స్థానాన్ని ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయని ఖతారీ దియార్ సీఈఓ షేక్ హమద్ బిన్ తలాల్ అల్-థానీ అన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







