డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!

- March 04, 2026 , by Maagulf
డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!

యూఏఈ: విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని డిస్టెన్స్ లెర్నింగ్ ను మార్చి 6 వరకు పొడిగించినట్టు యూఏఈ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని పేర్కొంది.  

తాజా పరిస్థితులను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని  నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి తెలిపారు.  అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతుందని, ఈ క్రమంలో ఇరాన్ విచక్షణ కోల్పోయి యూఏఈ పై దాడులకు పాల్పడుతుందని తెలిపింది. 

విద్యా రంగంతో పాటు, అధికారులు ప్రైవేట్ రంగ సంస్థలు రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించినట్లు వెల్లడించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com