30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- January 11, 2026
యూఏఈః ఫిలిప్పీన్స్కు చెందిన అన్నా లీ గయోంగాన్ బిగ్ టికెట్ డ్రాలో 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది. ఆరుగురు తోబుట్టువులలో ఒకరైన గయోంగాన్, విజయం సాధించినట్లు కాల్ అందుకున్న క్షణాలు తన జీవితంలో మరచిపోనని తెలిపారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి కష్టాలను గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
తన కుటుంబంలో గ్రాడ్యుయేట్ అయిన మొదటి వ్యక్తి నని, అకౌంటెంట్గా తన కెరీర్కు బోర్డు పరీక్ష రాసేందుకు డబ్బులు లేకపోవడంతో తన తల్లితో కలిసి పండ్లు, చేపలు మొదలైన వాటిని విక్రయించినట్లు తెలిపారు. తమకు సొంత ఇళ్లు లేదని అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని చెప్పారు. తోబుట్టువులు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటామని తెలిపారు. తన కుటుంబానికి ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అన్నా లీ గయోంగాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









