జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- January 13, 2026
మనామాః యూనీకో బహ్రెయిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జయశంకర్ విశ్వనాథన్ జనవరి 10న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక చెంబై సంగీత సంరక్షక పురస్కారం అందుకున్నారు. డాక్టర్ టి.వి.జి. అకాడమీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ & ఆర్ట్స్ (AIMA) ఈ అవార్డును ప్రకటించగా.. లెజేండ్ సంగీత విద్వాంసులు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ టి. వి. గోపాలకృష్ణన్ ప్రదానం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం పరిరక్షణకు విశ్వనాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు లభించింది. ఒక సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుడిగా మరియు వ్యాపారవేత్తగా విశ్వనాథన్ బహ్రెయిన్లో గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









