జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- January 13, 2026
మనామాః యూనీకో బహ్రెయిన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జయశంకర్ విశ్వనాథన్ జనవరి 10న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక చెంబై సంగీత సంరక్షక పురస్కారం అందుకున్నారు. డాక్టర్ టి.వి.జి. అకాడమీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ & ఆర్ట్స్ (AIMA) ఈ అవార్డును ప్రకటించగా.. లెజేండ్ సంగీత విద్వాంసులు మరియు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ టి. వి. గోపాలకృష్ణన్ ప్రదానం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతం పరిరక్షణకు విశ్వనాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఆయనకు లభించింది. ఒక సీనియర్ మేనేజ్మెంట్ నిపుణుడిగా మరియు వ్యాపారవేత్తగా విశ్వనాథన్ బహ్రెయిన్లో గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









