జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 13, 2026
దోహా: ఖతార్ లో ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లులో సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ కింద ఫ్రీ, రాయితీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 20న ప్రారంభమవుతుందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 3,500 ఉచిత మరియు రాయితీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఒకసారి చేరిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టు కింద చదువుకోవచ్చని పేర్కొంది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రాజెక్ట్లో పూర్తిగా ఉచిత సీట్లు, రాయితీ సీట్లు, వికలాంగ విద్యార్థుల కోసం కేటాయించిన ఉచిత సీట్లు, ఖతారీ విద్యార్థుల కోసం సీట్లతో సహా అనేక రకాల సీట్లు ఉన్నాయని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని జాతీయతలకు చెందిన కుటుంబాలకు ఈ సీట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబ మొత్తం ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్ను మించకూడదని తెలిపింది. ఇక రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్గా నిర్ణయించారు. బ్రిటిష్, ఇండియన్, అమెరికన్ మరియు నేషనల్ సిలబస్ స్కూళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!









