ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- January 19, 2026
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం, జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలేరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, రాష్ట్ర ప్రభుత్వం వైద్యం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ అవకాశాలను తెలంగాణ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేకంగా భాషా శిక్షణ కార్యక్రమాలను అందిస్తోందని తెలిపారు.
‘ప్రజా పాలన–ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా పాలేరు (Khammam development) ప్రభుత్వ నర్సింగ్ కళాశాలతో పాటు కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అలాగే మద్దులపల్లిలో కొత్త మార్కెట్ యార్డును కూడా ప్రజలకు అంకితం చేశారు. మున్నేరు–పాలేరు అనుసంధాన కాలువ, జేఎన్టీయూ కళాశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం ద్వారా ఖమ్మం జిల్లా అభివృద్ధికి మరింత వేగం అందుతుందని సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







