ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- January 19, 2026
జ్యూరిక్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశాల్లో పాల్గొనే ఉద్దేశంతో స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోమవారం అక్కడి విమానాశ్రయంలో భారత రాయబారి మృదుల్ కుమార్ చేత అధికారికంగా స్వాగతం పొందారు.
జ్యూరిక్ చేరుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన పాలసీ సంస్కరణలు, గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్, డిజిటల్ మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలిసింది.
దావోస్లో జరగనున్న WEF సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ నేతలు, ఆర్థిక నిపుణులు, ప్రభుత్వాధినేతలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







