వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- January 19, 2026
అమెరికా: అమెరికాలో భారీ సెక్స్, డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణల పై భారత సంతతికి చెందిన దంపతులతో పాటు మరో ముగ్గురిని ఫెడరల్, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియా రాష్ట్రంలో వీరు తమ సొంత మోటల్నే అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చి ఈ దందా నడిపినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… 52 ఏళ్ల కోశా శర్మ, 55 ఏళ్ల తరుణ్ శర్మ దంపతులు వర్జీనియాలో ‘రెడ్ కార్పెట్ ఇన్’ అనే మోటల్ నిర్వహిస్తున్నారు. వీరు తమ మోటల్లోని మూడో అంతస్తును పూర్తిగా డ్రగ్స్ అమ్మకాలు, వ్యభిచారం కోసం కేటాయించి, కింది అంతస్తులలో సాధారణ అతిథులకు గదులు ఇచ్చేవారు. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాల్లో వాటాలు తీసుకునేవారని ఫెడరల్ అధికారులు తెలిపారు. వీరితో పాటు ఈ రాకెట్లో భాగస్వాములైన మార్గో పియర్స్ (51), జాషువా రెడ్డిక్ (40), రషార్డ్ స్మిత్ (33) అనే మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు.
కోర్టు పత్రాల ప్రకారం 2025 మే నుంచి ఆగస్టు మధ్య ఎఫ్బీఐ, స్థానిక పోలీసులు తొమ్మిదిసార్లు అండర్కవర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఏజెంట్లు విటులుగా, సెక్స్ వర్కర్లుగా మోటల్కు వెళ్లి వీరి గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో 15 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేయగా, వాటిలో 11 సార్లు ఫెంటానిల్, నాలుగు సార్లు కొకైన్ లభించింది. కనీసం ఎనిమిది మంది మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, వారిని శారీరకంగా హింసిస్తూ బయటకు వెళ్లకుండా నిర్బంధించారని తేలింది.
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







